Sunday, August 10, 2014

అమితాబ్ కు మరో అరుదైన గౌరవం



  బాలీవుడ్మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు మరో అరుదైనగౌరవం దక్కింది. ఆయన కీర్తికిరీటంలో మరోకలికితురాయి చేరింది. సిడ్నీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలోఅమితాబ్ మైనపు బొమ్మను ఏడాది చేర్చబోతున్నారు. విషయాన్ని మ్యూజియంవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో కెప్టెన్ కుక్, డాన్ బ్రాడ్మన్, నికోల్ కిడ్మన్, హగ్ జాక్మన్, జానీడెప్, లేడీ గాగాల సరసనఅమితాబ్ మైనపు బొమ్మ కూడాచేరబోతోంది. బొమ్మను ఇంటరాక్టివ్సెట్టింగ్లో పెట్టబోతుండటంతో అభిమానులుదానికి సమీపంగా వెళ్లి స్వయంగా అమితాబ్ను కలిసిన అనుభూతినికూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పోల్నిర్వహించి, ఈసారి టస్సాడ్స్మ్యూజియంలో సెలబ్రిటీ బొమ్మ పెట్టాలని అడిగితే, ఎక్కువ మంది అమితాబ్నేఎన్నుకున్నారట. విషయాన్ని మ్యూజియంజనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ ప్రకటించారు. ఇప్పటికే జీవితకాల సాఫల్యాన్ని సాధించిన అమితాబ్ బచ్చన్విగ్రహం పెట్టడం మ్యూజియానికే గౌరవం అన్నారు.

No comments:

Post a Comment