Showing posts with label KOLLYWOOD GOSSIPS. Show all posts
Showing posts with label KOLLYWOOD GOSSIPS. Show all posts

Monday, August 11, 2014

హాలీవుడ్‌కెళ్లేది ఎవరు?

కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమయిన అంశం గురించి చర్చ జోరుగా సాగుతోంది. అదే హాలీవుడ్‌కెళ్లే దక్షిణాది హీరోయిన్ ఎవరన్నది. ఈ విషయంలో అందాల తార అనుష్క,నయనతారల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే హాలీవుడ్‌లో రూపొందుతున్న బ్రహ్మాండ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ఎక్స్‌పాండబుల్‌లో ఏడుగురు హీరోయిన్లు ముఖ్య పాత్రలు ధరించనున్నారట. ఈ ఏడుగురు హీరోయిన్ల పాత్రలకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నటీమణులను ఎంపిక చేసి నటింప చేయాలన్నది యూనిట్ వర్గాల నిర్ణయం.

 ఆ ఏడుగురు హీరోయిన్లలో దక్షిణాదికి చెందిన ఒక నటిని నటింప జేయాలని నిర్ణయించారట. వచ్చే ఏడాది ఎక్స్‌పాండబుల్ చిత్ర దర్శక, నిర్మాతల బృందం ముంబాయి చెన్నైలో మకాం పెట్టి హీరోయిన్ల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు సిల్వర్‌స్టార్ స్టాలిన్, మెల్‌గిప్సన్‌లు గౌరవ పాత్రల్లో మెరవనున్నారట. చిత్రంలో ఏడుగురు హీరోయిన్లు గ్లామర్‌ను గుప్పించడంతో పాటు సాహసోపేత పోరాటాలు చేయూల్సి ఉంటుందట. దీంతో తమిళంలో నయనతార, అనుష్క, రాయ్ లక్ష్మీ, నీతు చంద్రలలో ఒకరు ఎంపికయ్యే వకాశం ఉందని సమాచారం.

 అనుష్క అరుంధతి చిత్రంలో కత్తి చేత పట్టి రౌద్రపూరిత నటనను ప్రదర్శించారు. తాజాగా రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో వీరోచిత పాత్రల్ని పోషిస్తున్నారు. నయనతార తమిళ బిల్లా చిత్రంలో ఈత దుస్తుల్లో అందాల మోత మోగించడంతోపాటు పిస్టల్ చేత పట్టి హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఇక నీతు చంద్ర ఆదిభగవాన్ చిత్రంలో, రాయ్‌లక్ష్మీ కూడా కొన్ని చిత్రాల్లో యాక్షన్ హీరోయిన్‌గా నటించారు. అయితే నయనతార, అనుష్కల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని కోలీవుడ్ టాక్.  మరి హాలీవుడ్‌కు వెళ్లేదెవరో..?

వదంతుల వలలోనయనతార

  కొందర్ని చూస్తే మెచ్చబుద్ధి.. మరొకర్ని చూస్తే మొత్తబుద్ధి వేస్తుందనే సామెత ఉంది. అలానే నయనతారను చూస్తే ఏవేవో రాయాలనిపిస్తుందేమో. ప్రేమ వ్యవహారాల్లో ఇంతకు ముందు సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీపై ఇటీవల మళ్లీ వదంతుల పరంపర మొదలైం ది. శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి కథ కంచెకు చేరిన విధంగా మారిన లవ్‌స్టోరీ ఆ మధ్యలో చాలా కలకలాన్ని సృష్టించాయి. కొంత కాలంగా వీటికి దూరంగా ఉన్న నాయనపై మళ్లీ వదంతుల ప్రవాహాని కి తెరలేసింది. అందుకు కారణం ఆమె మళ్లీ తన మాజీ ప్రియుడు శింబుతో జత కట్టడమే కారణం కావచ్చు.

ఈ మధ్య ఆర్య సరసన రాజారాణి చిత్రం లో నటించినప్పుడు వీరిద్దరి గురించి కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఆర్య నయనకు బిర్యాని విందునిచ్చారని, ఇద్దరూ నక్షత్ర హోటళ్లలో ఏకాం తంగా కలుసుకుంటున్నారని రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. అవ న్నీ వదంతులే అంటూ నయనతార ఖండించారు. తాజాగా శింబుతో సాన్నిహిత్యం గురించి మరోసారి గాసిప్సు గుప్పుమన్నాయి. వీటిపై నయనతార స్పందిస్తూ తన గురించి చాలా వదంతులు ప్రచారమవుతున్నాయన్నారు. ఆర్యను ప్రేమిస్తున్నట్లు, శింబుతో షికార్లు అంటూ ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని చెప్పారు. తాము నటులమ ని, వృత్తిపై అంకితభావం చూపిస్తున్నామని అన్నారు.

ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతామన్నారు. అంతేకానీ తమ మధ్య  ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. అయి తే ఇలాంటి వదంతులకు కొందరు న టీనటులు ఇష్టపడతారనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బా లీవుడ్ తారలు ఇలాంటి గ్యాసిప్స్‌ను ప్రచారం చేస్తారని, తద్వారా వారు ఫలం పొందుతున్నట్లు చెబుతారని అన్నారు. అందువల్లే తమ గురిం చి వదంతులు ప్రచారం అయినప్పటికీ ఆనందిస్తారన్నారు. ఆ సంస్కృతి ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యిందని అన్నా రు. తెలుగులో ఇలాంటి పరిస్థితి లేదని నయనతార తెలిపారు.